హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ఈ నెల 9న మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగనున్నది.
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన నిధులు, రాష్ట్రం అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశాలున్నట్టు తెలిసింది.