హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): షెడ్యూల్ తెగల కోసం గతంలో ఎన్నడూలేని విధంగా అధిక మొత్తంలో నిధులు కేటాయించి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తున్న బీఆర్ఎస్ సరారుకే తమ పూర్తి మద్దతు ఉంటుందని లబానా (కాయితీ) లంబాడీ సమాజం స్పష్టంచేసింది. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్పై తమకు పూర్తి నమ్మకం ఉన్నదని, మూడోసారి బీఆర్ఎస్ సరారు అధికారంలోకి వచ్చి, తమ సమస్యలు పరిషరించేది ఖాయమని పేర్కొన్నారు.
నిజామాబాద్ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో నామినేషన్లు వేస్తున్నట్టు ప్రకటించిన నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకున్నట్టు ప్రకటించారు. ఎంపీ బీబీ పాటిల్ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్లో ఆర్థిక మంత్రి హరీశ్రావును లబనా లంబాడా ప్రతినిధులు కలిశారు. ఈ సందర్బంగా లబానా లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చడంతోపాటు సంక్షేమ బోర్డు ఏర్పాటు తదితర విషయాల గురించి మంత్రికి విన్నవించారు.
అనంతరం హరీశ్రావు మాట్లాడుతూ.. షెడ్యూల్ తెగల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యం ఇచ్చారని చెప్పారు. 4.6 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. వినతుల పట్ల సానుకూలంగా స్పందించిన మంత్రి హరీశ్రావుకు సంఘం ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి హరీశ్రావును కలిసినవారిలో లబానా లంబాడీ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ తాన్సింగ్నాయక్, అమర్సింగ్నాయక్, చందానాయక్, బిషన్లాల్, జగదీశ్, గంగారాం, దర్బార్, గోపాల్ తదితర నాయకులు ఉన్నారు.