సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లాలో(Sangareddy) విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి పడి ఓ మేస్త్రీ మృతి(Mason died) చెందాడు. ఈ విషాదకర సంఘటన పటాన్చెరులో(Patancheru) ఆదివారంచోటు చేసుకుంది. భవనానికి ప్లాస్టరింగ్ చేస్తుండగా ఏడో అంతస్తు నుంచి జారిపడి బెంగాల్కు చెందిన మమ్జుల్ షేక్(33) అనే మేస్త్రీ అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.