బైక్ సీటులోకి చొచ్చుకుపోయిన పామును చూసి ఓ వ్యక్తి కంగుతిన్నాడు. హనుమకొండ జిల్లా వేలేరు మండలం ఎర్రబెల్లికి చెందిన రేన నర్సయ్య బైక్పై భీమదేవరపల్లి మండలం కొత్తకొండకు బయల్దేరాడు. మార్గమధ్యంలో బైక్ చక్రంలో ఏదో ఇరుక్కున్నట్టు అనిపించగా వెనక్కి చూడగా పాము కన్పించింది. దీంతో అదుపుతప్పి కిందపడటంతో బైక్ సీటు ఎగిరిపడింది.
పక్కనే ఉన్న కొత్తకొండ వాసులు నర్సయ్యను పైకి లేపేందుకు పరుగెత్తుకు రాగా బైక్ వెనుక సీటులో పాము కనిపించింది. స్థానికులు అరగంట సేపు ప్రయత్నించి పామును బయటకు తీసి చంపేశారు.