సంగారెడ్డి : సెల్ఫోన్ వివాదం(Cell phone) ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సెల్ఫోన్ విషయంలో యాదగిరి, రాజు అనే వ్యక్తుల మధ్య వివాదం తలెత్తింది. మద్యం మత్తులో ఉన్న రాజు యాద గిరిని బండరాయితో కొట్టి దారుణంగా(Brutally murdered) హతమార్చాడు. ఈ విషాదకర సంఘటన సంగారెడ్డి (Sangareddy) జిల్లా జిన్నారం మండలం ఐడీఏ బొల్లారంలో(IDA Bollaram) బుధవారం చోటు చేసుకుంది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నిందితుడు రాజును అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. యాదగిరి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.