హైదరాబాద్ : కరెంట్ స్తంభం(Electric pole) నుంచి పడి ఓ వ్యక్తి మృతి(Man died) చెందాడు. ఈ విషాదకర సంఘటన జనగామ(Janagama) జిల్లా లింగాల ఘణపురం మండలం వనపర్తిలో చోటు చేసుకుంది. స్థాని కులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మహేందర్ విద్యుత్ సంభం పై నుంచి పడి మృతి చెందాడు.
మహేందర్ మృతికి విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ గ్రామస్తులు ఆందోలళనకు దిగారు. జనగామ-సూర్యాపేట రహదారిపై రాస్తారోకో చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.