తెలకపల్లి, జనవరి 30: ఎస్సై తిట్టాడంటూ ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలంలో చోటుచేసుకున్నది. గౌతంపల్లికి చెందిన కాటమోని మల్లేశ్ భార్య జంగమ్మకు, పక్క పొలం వారితో పశువుల విషయంలో గొడవ జరిగింది.
పక్క పొలానికి చెందిన రైతు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, మల్లేశ్ను ఎస్సై రామేశ్వర్రెడ్డి పోలీస్స్టేషన్ను పిలిపించుకొని విచారణ చేశారు. దీంతో ఎస్సై తనను దూషించాడని మనస్తాపానికి గురైన మల్లేశ్ స్టేషన్ నుంచి బయటకు వచ్చి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం నాగర్కర్నూల్ ఏరియా దవాఖానకు తరలించారు.