Nizamabad | నిజామాబాద్ : జిల్లా పరిధిలోని ఇందల్వాయి టోల్ప్లాజా వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. పీకల దాకా మద్యం సేవించిన లారీ డ్రైవర్.. ముందు వెళ్తున్న కారును ఢీకొట్టాడు. దీంతో లారీ, కారు టోల్ప్లాజా కౌంటర్లోకి దూసుకెళ్లాయి.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. టోల్ ప్లాజాలో పని చేస్తున్న ఇద్దరు సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ నలుగురిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.