హైదరాబాద్ : జగిత్యాల జిల్లాలో రహదారిపై మద్యం వ్యాన్(Liquor van) బోల్తా పడటంతో(Overturned) సుమారు 50 లక్షల ఆస్తి నష్టం జరిగింది. వివరాల్లోకి వెళ్తే..మద్యం లోడ్తో జగిత్యాల-కరీంనగర్ రహదారిపై వెళ్తున్న వ్యాన్ జగిత్యాల(Jagityala) శివారు వీఆర్కే ఇంజినీరింగ్ కాలేజీ వద్ద చోటు చేసుకుంది. మద్యం సీసాలు పగటడంతో రూ.50లక్షల ఆస్తి నష్టం జరిగింది. కాగా, ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను కరీంనగర్ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.