జేపీసీ వేయాలి లేదంటే సీజేఐతో విచారణ చేపట్టాలి దేశ ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ, ప్రపంచ దేశాల ముందు భారత్ ప్రతిష్ఠను దిగజార్చిన అదానీ గ్రూప్పై సమగ్ర విచారణ చేయాలి. ఈ ఆర్థిక సంక్షోభంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలి. లేదంటే సుప్రీం కోర్టు న్యాయమూర్తితో విచారణ చేపట్టాలి. దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసే ఆర్థిక అంశం కాబట్టే వాయిదా తీర్మానం ఇచ్చి చర్చ జరుగాలని డిమాండ్ చేశాం. అదానీ షేర్లు 27 శాతం పడిపోయాయి. వ్యాపారస్తులు ప్రభుత్వ స్నేహితులు, అందుకే కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదు. వాయిదా తీర్మానం నోటీస్ ఆర్డర్లో లేదని చైర్మన్ పేర్కొనటం హాస్యాస్పదం. సభను ఆర్డర్లో పెట్టి చర్చ ప్రారంభించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని అర్థమైంది.
– బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు
హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ) : దేశ ఆర్థిక వ్యవస్థను భ్రష్టుపట్టించి ప్రపంచంలో భారత ప్రతిష్ఠను దిగజార్చిన అదానీ గ్రూప్పై పార్లమెంట్లో చర్చించాలని బీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. గురువారం పార్లమెంట్ ఉభయ సభలు ప్రారం భం కాగానే రాజ్యసభలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, పార్టీ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదికపై చర్చ కు వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. బీఆర్ఎస్ ఇచ్చిన నోటీసులు ఉభయ సభల్లో తిరస్కరణకు గురయ్యాయి. దీంతో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్ ఆందోళనకు మద్దతుగా కాంగ్రెస్ సహా ఇతర విపక్ష పార్టీలు కూడా గొంతు కలిపాయి.
నిరసనలో పాల్గొన్నాయి. ప్రశ్నోత్తరాల సమయం చాలా ము ఖ్యమైందని, సభ్యులు అంతరాయం కలిగించొద్దని లోక్సభ స్పీకర్ ఓంబిర్లా సభ్యులను కోరారు. అయినా బీఆర్ఎస్ ఎంపీలు వెనక్కి తగ్గకపోవడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. మరోవైపు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. ఉదయం 11 గంటలకు చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ సభను ప్రారంభించగానే బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చి చర్చకు పట్టుబట్టారు. రాజ్యసభ చైర్మన్ బీఆర్ఎస్ ఇచ్చిన తీర్మానాన్ని తోసిపుచ్చటంతో బీఆర్ఎస్ ఎంపీలు కేంద్రం తీరుపై నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్తోపాటు కాంగ్రెస్ సహా పలు పార్టీల సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్టు చైర్మన్ ప్రకటించారు.
మధ్యాహ్నం 2 గంటలకు ఉభయ సభలు తిరిగి ప్రారంభమయ్యాయి. విపక్ష పార్టీల సభ్యులు తిరిగి వాయిదా తీర్మానానికి పట్టుబట్టారు. చర్చ జరగాల్సిందేనని తేల్చిచెప్పారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్ర స్థాయిలో సభ్యులు మండిపడ్డారు. ఎంపీ వెంకటేశ్ నేత స్పీకర్ పోడియం వద్దకు దూసుకుపోయారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీఆర్ఎస్ ఎంపీల ఆందోళనలతో మిగితా ప్రతిపక్ష పార్టీల సభ్యులు జతకట్టారు. ఆందోళనల నేపథ్యంలో ఉభయ సభలు శుక్రవారం ఉదయం 11 గంటలకు వాయిదా పడ్డాయి. పార్లమెంట్ వాయిదా అనంతరం ఢిల్లీలో బీఆర్ఎస్ లోక్సభాపక్షనేత నామా నాగేశ్వర్రావు, ఎంపీలు కేఆర్ సురేశ్రెడ్డి, సంతోష్కుమార్, పోతుగంటి రాములు, జీ రంజిత్రెడ్డి, కొత్త ప్రభాకర్రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్తో కలిసి కే కేశవరావు మీడియాతో మాట్లాడారు.
అదానీ గ్రూప్పై చర్చించాలని బీఆర్ఎస్ సహా దేశంలోని అన్ని పార్టీలు డిమాండ్ చేస్తు న్నా కేంద్రం పట్టించుకోవటంలేదు. మోదీ దేశ సం పదను గుజరాత్ వ్యాపారస్థులకు కట్టబెడుతున్నారు. అందుకే అదానీ అక్రమాలపై చర్చించేందుకు ముందుకు రావడం లేదు. అదానీ వ్యవహారం, కేంద్రం తీరుపై దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తాం. అవసరమైతే దేశంలోని అన్ని రాష్ర్టాల శాసనసభ సమావేశాల్లో అదానీపై చర్యలకు తీర్మానాలు చేసి కేంద్రానికి పంపేలా ప్రయత్నిస్తాం.
-ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి
దేశ ప్రజలకు సంబంధించిన అం శాన్ని చర్చించాలని పట్టుబడితే చర్చకు అనుమతి ఇవ్వకుండా కేంద్రం ప్రభు త్వం వెనక్కిపోతున్నది. దేశ ఆర్థిక వ్యవస్థను తమ తాబేదార్లకు కట్టబెడుతూ సామాన్య ప్రజలపై భారాన్ని మోపుతు న్న కేంద్రం తీరును ఎండగడతాం. ఎల్ఐసీ, ఎస్బీఐ సహా ప్రభుత్వరంగ సం స్థలను నిర్వీర్యం చేస్తూ తమ స్నేహితులకు ప్రయోజనం కలిగే విధంగా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. సమావేశాలను పారదర్శకంగా నిర్వహిస్తామని, సభ్యులు లేననెత్తిన ప్రతీ అంశంపై చర్చిస్తామని నీతులు చెప్పిన కేంద్రం సభల్లో మా త్రం చర్చించేందుకు భయపడుతున్నది.
-బీఆర్ఎస్ లోక్సభాపక్షనేత, నామా నాగేశ్వర్రావు
అదానీ గ్రూప్పై వస్తున్న ఆరోపణలపై నిజానిజాలను నిగ్గుతేల్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉన్నది. అదానీ గ్రూపులో ఉన్న పెట్టుబడుల్లో పేద ప్రజల సొమ్ము కూడా ఉన్నది. ఎల్ఐసీలో ప్రజలు పెట్టిన సొ మ్మును అదానీ గ్రూపులోకి మళ్లించారు. ఇది ప్రజాధ నం. జాయింట్ పార్లమెంటరీ కమిటీతో చర్చించాలి.
– పెద్దపల్లి ఎంపీ బోర్లకుంటవెంకటేశ్ నేత