Restaurant on Wheels | హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 24 (నమస్తే తెలంగాణ): ప్రయాణికులను ఆకట్టుకునేందుకు దక్షిణ మధ్య రైల్వే జోనల్ అధికారులు మరో సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. ‘రెస్టారెంట్ ఆన్ వీల్స్’ పేరుతో కాచిగూడ రైల్వేస్టేషన్ ఆవరణలో హోటల్ ప్రారంభించారు. రెండు హెరిటేజ్ కోచ్లను రెస్టారెంట్గా మార్చి, లోపలి భాగాన్ని అందంగా ముస్తాబు చేశారు.
ఫర్నిచర్, డైనింగ్ హాల్, కిచెన్ కస్టమర్లను తీర్చిదిద్దారు. సందర్శకులు ప్రత్యేక అనుభూతి సొంతం చేసుకునేలా ‘రెస్టారెంట్ ఆన్ వీల్స్’ను తొలిసారి కాచిగూడలో ఏర్పాటుచేసినట్టు రైల్వే అధికారులు చెప్పారు. ఉత్తర, దక్షిణ భారత వంటకాలతోపాటు, మేఘాలయ, చైనీస్ వెరైటీలూ 24 గంటలూ అందుబాటులో ఉంటాయని తెలిపారు.