హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వ రద్దు వివాదంపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఆయన ద్వంద్వ పౌరసత్వాన్ని కలిగి ఉన్నారని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తరఫు న్యాయవాది వాదించారు. దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవాది స్పందిస్తూ రమేశ్ పౌరసత్వాన్ని చట్టవిరుద్ధంగా రద్దు చేశారని వాదించారు.
దీంతో గత ఏడాది కాలంలో రమేశ్ జరిపిన విదేశీ పర్యటనల వివరాలను అందజేయాలని జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డి ఆదేశించారు. పాస్పోర్టులు సరెండర్ చేసిందీ లేనిదీ కూడా చెప్పాలని పేర్కొంటూ.. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు.