కరీంనగర్ : ఎరువుల దుకాణం అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి వద్ద లంచం తీసుకుంటూ పట్టుబడ్డ నేరంలో నిందితుడు అధికారి అన్నారెడ్డి ప్రాణవేందర్రెడ్డికి9Government employee) నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.6 వేల జరిమానా విధిస్తూ కరీంనగర్( Karimnagar) ఏసీబీ ప్రత్యేక కోర్టు(ACB court) న్యాయమూర్తి కుమార్వివేక్ గురువారం తీర్పునిచ్చారు. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన దైవాల శ్రీనివాస్ 2013 ఆగస్టు 27న అదే గ్రామంలో ఎరువుల దుకాణం అనుమతి కోసం కరీంనగర్లోని అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఆఫీసులో దరఖాస్తు చేసుకున్నాడు.
కరీంనగర్ ఏడీ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న అన్నారెడ్డి ప్రాణవేందర్రెడ్డి శ్రీనివాస్ దరఖాస్తు చేసుకున్న ఫైలును పై అధికారులకు పంపి అనుమతి ఇప్పించేందుకు రూ.3 వేల లంచం ఇవ్వాలని తెలిపాడు. దీంతో శ్రీనివాస్ చేసేదేమీ లేక కరీంనగర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల సూచనపై 2013 సెప్టెంబర్ 5న శ్రీనివాస్ కరీంనగర్లోని ఏడీ కార్యాలయానికి వెళ్లి లంచంగా అడిగిన డబ్బులు ఇవ్వగా, తీసుకున్న ప్రాణవేందర్రెడ్డిని ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో సిబ్బంది రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
అతనిపై కేసు నమోదు చేశారు. ఏసీబీ డీఎస్పీ ఈ కేసుపై దర్యాప్తు జరిపారు. సాక్షులను అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కిశోర్కుమార్ కోర్టులో ప్రవేశపెట్టి విచారించారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన జడ్జి వివేక్ కుమార్ నిందితుడు ప్రాణవేందర్రెడ్డికి నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.6 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. ప్రస్తుతం ప్రాణవేందర్రెడ్డి గంగాధర వ్యవసాయ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నట్లు తెలిసింది.