హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ డిగ్రీ కాలేజీలను నెలకొల్పుతున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో కొత్త కాలేజీని మంజూరుచేసింది.
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీని మంజూరు చేసింది. ఈ మేరకు సోమవారం విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీవో విడుదల చేశారు. ఇటీవలే ఐదు డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.