జోగులాంబ గద్వాల : విద్యుత్ షార్ట్ సర్క్యూట్(Short circuit)తో వస్త్ర దుకాణం(Garment shop) దగ్ధమైంది. ఈ సంఘటన బుధవారం గద్వాల పట్టణ(Gadwala) పరిధిలోని చిన్న అగ్రహారం వద్ద చోటు చేసుకుంది. రూ.30 లక్షల వరకు సరుకులు మొత్తం కాలిబూడిదయ్యాయి. ఈ విషయం తెలిసిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.
బట్టల షాప్ యజమాని చంద్రబాబుని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి నష్టపరిహారం వచ్చే విధంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే ఎంపీపీ విజయ్, వెంటనే జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ జంబు రామన్ గౌడ్, కౌన్సిలర్ శ్రీను, బీఆర్ఎస్ పార్టీ నాయకులు నరేందర్, రామాంజనేయులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.