మహబూబాబాద్ : మహబూబాబాద్( Mahbubabad)జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్(Tractor) ఢీ కొని ఐదేండ్ల బాలుడు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని మహబూబాబాద్ మండలం రెడ్యాలలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బంధువుల ఇంటికి ఫంక్షన్ కి వచ్చిన రోడ్డుపై వెళ్తున్న సాత్విక్(5) అనే బాలుడిని వెనుక నుంచి ట్రాక్టరు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని తల్లిని దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.