ఆదిబట్ల, మే 16: రంగారెడ్డి జిల్లా నాగార్జున సాగర్ రహదారి తుర్కయంజాల్ వద్ద సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ఓ లారీ డ్రైవర్.. ఆగి ఉన్న డీసీఎం వాహనాన్ని ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
ఇబ్రహీంపట్నంలో డీజే ఈవెంట్ ముగించుకొని హైదరాబాద్ వైపు డీజే బాక్సుల లోడుతో వెళ్తున్న డీసీఎం వాహనాన్ని తుర్కయంజాల్ తులిప్స్ హోటల్లో వద్ద లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.