మిరుదొడ్డి, ఆగస్టు 22 : ‘కాంగ్రెస్ సర్కార్ వచ్చినంక మా బతుకులు ఆగమయ్యాయి’ అని ఓ రైతు ఆవేదన చెందాడు. శనివారం సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో పర్యటిస్తున్న క్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి రైతు ర్యాకం కిష్టయ్యను పలుకరిస్తూ బాగున్నావా పెద్దాయనా? అని అడుగగా.. ఆ రైతు తన కష్టాలను ఏకరువు పెట్టాడు. ‘ఏం బాగున్నామయ్యా.. ఆగమైపోయినం.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అచ్చినప్పటి నుంచి మాకు అన్నీ కష్టాలే’ అని తన గోడువెళ్లబోసుకున్నాడు.
‘నాకు ఫోన్ లేకపాయే.. యూరి యా రాకపాయే.. పొలాలకు నీళ్లు లేవు.. అచ్చిన నీళ్లతో పొలం సరిగ్గా పారుతలేదు.. కరెంటు కూడా సక్కగా వస్తలేదు.. గిదేం పాలనో అర్థమైతలేదు.. రైతులమంతా అష్టకష్టాలు పతుడున్నం’ అని ఆవేదన వ్యక్తంచేశా డు. కాంగ్రెస్కు ఓట్లేసి ఆగం చేసుకున్నం.. ఇప్పుడు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నం’ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కాడు. ‘ఇప్పడు గీ సీఎం రేవంత్రెడ్డి పాలన పోయి మళ్లా కేసీఆర్ సార్ పాలన అత్తనే మా రైతులకు మంచి రోజులు వత్తాయి’ అని తెగేసి చెప్పాడు.