Medak | పాపన్నపేట : పాపన్నపేట మండల పరిధిలోని ఎల్లాపూర్ గ్రామానికి చెందిన పట్నం శంకరయ్య( 61 )అనే రైతు విద్యుత్ షాక్కు గురై మృతి చెందినట్లు పాపన్నపేట ఎస్ఐ మహిపాల్ రెడ్డి వెల్లడించారు. ఎల్లాపూర్ గ్రామానికి చెందిన పట్నం శంకరయ్య ఈ నెల 22న ఉదయం 11 గంటల ప్రాంతంలో పొలం వద్దకు వెళ్లాడు. అయితే కోతుల నుండి రక్షణ కోసం పొలం చుట్టూ వేసిన విద్యుత్ కంచెకు శంకరయ్య తగిలాడు. దీంతో ఆయనఅక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
పంట పొలంలో పడి ఉన్న రైతును గమనించిన స్థానికులు.. అతని కుమారుడు మహేందర్కు సమాచారం అందించారు. దీంతో మహేందర్ పొలం వద్దకు వెళ్లి చూడగా తండ్రి శంకరయ్య విద్యుత్ కంచెకు తగిలి మృతి చెంది ఉన్నాడు. మహేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, విచారణ జరుపుతున్నట్లు ఎస్ఐ మహిపాల్ రెడ్డి తెలిపారు.