Adilabad | ఆదిలాబాద్ రూరల్, జనవరి 26: డాక్టర్ కావాలనే కల నెరవేరకపోవడంతో మనస్తాపం చెందిన ఓ గిరిజన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సేవాదాస్ నగర్కు చెందిన హీర కుమ్ర సాయిపృథ్వీ (24) రెండేండ్ల క్రితం రష్యాలో ఎంబీబీఎస్ అడ్మిషన్ పొందాడు. ఇంతలోనే రష్యా – ఉక్రెయిన్ యుద్ధం మొదలవడంతో వెళ్లలేకపోయాడు.
ఈ క్రమంలో చదువుకు అంతరాయం కాకుండా కుటుంబ సభ్యులు బీఎస్సీ న్యూట్రిషన్ కోర్సు కోసం హైదరాబాద్లో అడ్మిషన్ ఇప్పించారు. ఎంబీబీఎస్ చేయలేకపోయానని తరచూ బాధపడుతుండేవాడు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం ఉదయం గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.