హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల పరిధుల్లో వీధి కుకల బెడదను నివారించడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. కుక్కల ద్వారా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మాసబ్ ట్యాంక్లోని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ కార్యాలయంలో బుధవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో మున్సిపల్శాఖ కార్యదర్శి సుదర్శన్రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, సీడీఎంఏ ఎన్ సత్యనారాయణ, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లు, వెటర్నరీ విభాగం అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్వింద్కుమార్ మాట్లాడుతూ జీహెచ్ఎంసీ పరిధిలో గతంలో 8.5 లక్షల వీధి కుక్కలుండేవని స్టెరిలైజేషన్ ఆపరేషన్స్ నిర్వహించడం వల్ల వాటి సంఖ్య 5.5 లక్షలకు తగ్గిందని తెలిపారు. వాటికి వెంటనే ఏబీసీ (ఎనిమల్ బర్త్ కంట్రోల్) స్టెరిలైజేషన్ ఆపరేషన్లు నిర్వహించాలని, ఆయా కాలనీల్లో కొన్ని వాటర్ పాయింట్స్ (నీటి నిల్వ సదుపాయం)ను కూడా ఏర్పాటుచేయాలని ఆదేశించారు.
జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న హోటల్స్, రెస్టారెంట్స్, ఫంక్షన్ హాల్స్, చికెన్ సెంటర్స్, మటన్ సెంటర్లు వ్యర్థ పదార్థాలను వీధుల్లో వేయకుండా కట్టడి చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. పాఠశాల విద్యార్థులకు పెంపుడు కుకల గురించి అవగాహన లేకపోవడంతో వాటి బారిన పడుతున్నారని. దీనిని నియంత్రించడానికి విద్యార్థులకు కూడా సరైన అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని అన్నారు. దీనికి సంబంధించిన కరపత్రాలు, హోర్డింగ్స్ సిద్ధం చేయాలని చెప్పారు. నగర, మున్సిపాలిటీల పరిధుల్లోని మురికివాడల అభివృద్ధి ఫెడరేషన్స్, పట్టణ అభివృద్ధి ఫెడరేషన్స్, రెసిడెంట్ కాలనీ వెల్ఫెర్ అసోసియేషన్స్ సహకారంతో వీధి కుక్కల నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలో ఉన్న ఇతర మున్సిపాలిటీల్లో మెప్మా, స్వయం సహాయక బృందాలతో నియంత్రణ చర్యలు చేపట్టాలని చెప్పారు.
ప్రత్యేక యాప్
పెంపుడు జంతువుల నమోదు గురించి కూడా ఒక ప్రత్యేక మొబైల్ యాప్ను సిద్ధం చేయాలని అర్వింద్కుమార్ అధికారులకు సూచించారు. వీటికి సంబంధించిన ఫిర్యాదులను మై జీహెచ్ఎంసీ ఫోన్ నంబర్ 040 – 21111111 ద్వారా నమోదు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. నగర పరిధిలో, పరిసర మున్సిపాలిటీల్లో పెంపుడు కుకల సంఖ్యను గుర్తించడానికి త్వరలో మొబైల్ యాప్ను రూపొందిస్తున్నామని తెలిపారు. ఆ యాప్లో సంబంధిత యజమానులు నమోదు చేసుకోవాలని, తద్వారా ఒక గుర్తింపు కార్డును కూడా మంజూరు చేయనున్నామని ఆయన పేరొన్నారు. ఎకువగా కేసులు నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించి అకడ తక్షణమే చర్యలు చేపట్టాలని చెప్పారు. ఆ ప్రాంతాల్లో వెటర్నరీ బృందాలను తరలించి వీధి కుక్కలను కట్టడి చేయడానికి తగు చర్యలు చేపట్టాలని, మూసీ పరివాహక ప్రాంతంలో కూడా ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.