హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): గిరిజనవాసుల దశాబ్దాల కల నెరవేరబోతున్నది. వచ్చే నెల 24 నుంచి 30 వరకు పోడుభూముల పట్టాలు పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అటవీ, గిరిజన, రెవెన్యూశాఖల సమన్వయంతో చేసిన కసరత్తు దాదాపు పూర్తి కావచ్చింది. ‘పోడు’భూముల పంపిణీ ఫైల్పై ముఖ్యమంత్రి కేసీఆర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన సచివాల యం ప్రారంభోత్సం అనంతరం తొలి సంత కం చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తం గా 28 జిల్లాలు, 295 మండలాలు, 2,845 గ్రామ పంచాయతీల పరిధిలో ఫారెస్ట్ రైట్ కమిటీలు క్షేత్రస్థాయిలో నెలలపాటు కసరత్తు చేశారు.
12,49,296 ఎకరాలకు 4,14,353 క్లెయిమ్స్ను ఫారెస్ట్ కమిటీలు వివిధస్థాయిలో పరిశీలించాయి. 4,05,601 ఎకరాలకు సం బంధించి 1,50,012 మంది లబ్ధిదారులు పోడు పట్టాలకు అర్హత సాధించనున్నారు. ఇప్పటికే పట్టాల పంపిణీపై గిరిజన, అటవీ, రెవెన్యూ శాఖల అధికారుల సంతకంతోపాటు లబ్ధిదారుడి ఫొటో ఉండేలా పట్టాదారు పాస్బుక్లు సిద్ధమయ్యాయి. ‘భవిష్యత్తులో అట వీ భూమి ఎట్టిపరిస్థితుల్లోనూ అన్యాక్రాంతం కాకూడదు. పోడుభూముల పట్టాల పంపిణీ విషయంలో పకడ్బందీ చర్యలు తీసుకొంటు న్నాం. అటవీ భూమిని ఆక్రమిస్తే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్న సంకేతాలు పో వాలి’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్న నేపథ్యం లో ప్రభుత్వ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకొంటున్నది.
ఒకసారి పంపిణీ తర్వాత అటవీ భూమి ఒక ఇంచుకూడా అన్యాక్రాంతం కాకుండా ఉండేదుకు పాలిగన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. భూమి సర్వే నంబర్, పంపిణీ చేసే భూమి విస్తీర్ణం, ఆ భూమి ఏ అకాంక్ష, రేఖాంశాల మధ్య ఉన్నది? సంబంధిత భూమి హద్దులు ఏవి? వంటి అంశాలను గూగుల్ మ్యాపింగ్ వివరాలతోపాటు హోలోగ్రామ్ను పోడుపట్టాలో పొందుపరచనున్నారు. పంపిణీ చేసిన తర్వాత భవిష్యత్తులో ఇరుగుపొరుగువారితో భూహద్దు వివాదాలు తలెత్తకుండా ఉండ టం, సదరు లబ్ధిదారుడి భూమి పక్కనే అటవీ భూమి ఉంటే కాలక్రమేణా సదరు భూమిని లబ్ధిదారుడు ఆక్రమించుకోకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ పాలిగన్ టెక్నాలజీని వినియోగించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. పంపిణీ విషయంలో కలెక్టర్లకు సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.