పెద్దపల్లి : పశువుల కోసం చెరువులోకి(Pond) వెళ్లి ఓ వ్యక్తి మృతి(died) చెందాడు. ఈ విషాద సంఘటన పెద్దపల్లి(Peddapalli) జిల్లాలోని ముత్తారం మండలంలోని పారుపల్లి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పశువుల కాపరి(Cowherd )లింగయ్య పశువులో కోసం చెరువులో దిగాడు.
ఈ క్రమంలో ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘట స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్ మార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లింగయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.