షాద్నగర్, ఫిబ్రవరి 3: అనుమానాస్పద స్థితిలో ఓ చిరుత పులి మృత్యువాత పడింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా చౌదరిగూడ మండలం పెద్ద ఎల్కిచర్ల గ్రామ పరిధిలో శనివారం వెలుగుచూసింది.
స్థానికులు, అటవీ శాఖ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. పెద్ద ఎల్కిచర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని అటవీ ప్రాతంలో చిరుతపులి కళేబరం కనిపించింది. ఐదారు రోజుల క్రితం మృతి చెంది ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. కారణాలు తెలియాల్సి ఉన్నది.