వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఏడుగురు సభ్యులున్న కేంద్ర బృందం మంగళవారం పర్యటించి వరద నష్టంపై అంచనా వేసింది.
వరద నష్టం వివరాలను హన్మకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్, వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య, గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాష కేంద్ర బృందానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. భారీ వర్షాల వల్ల రూ.450 కోట్ల నష్టం వాటిల్లినట్టు తెలిపారు.