హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై అసభ్యపదజాలం ప్రయోగించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై పోలీసులు ముందు గా కేసు నమోదు చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. లేదంటే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని చెప్పా రు. మాజీ ఎమ్మెల్యే, దళితబిడ్డ బాల సుమన్పై ఎఫ్ఐఆర్ నమోదుచేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించిన విధానాలనే ప్రస్తుత ప్రభుత్వం అవలంబిస్తున్నదని విమర్శించారు. ఢిల్లీ రిమోట్ కంట్రోల్ పాలన రాచరిక వ్యవస్థను తలపిస్తున్నదని మండిపడ్డారు.