హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): బలగం సినిమాలో పాటలు పాడిన పస్తం మొగిలయ్య-కొమురమ్మ దంపతులకు దళితబంధు పథకం కింద మంజూరైన కారును బుధవారం హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో కలిసి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు ఎల్లవేళలా అన్ని విధాలుగా అండగా ఉంటున్నదని చెప్పారు. దళితబంధు పథకమే అందు కు నిదర్శమని అన్నారు.
బోయినపల్లి వినోద్కుమార్ మాట్లాడుతూ.. దళితులందరూ ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో దేశంలో ఎకడా లేని విధంగా దళితబంధు పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నారని కొనియాడారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న మొగిలయ్యను నిమ్స్లో చేర్పించి వైద్యం చేయిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు మొగిలయ్య దంపతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
తమకు అన్నివిధాలుగా అండగా నిలిచారని, జీవితాంతం రుణపడి ఉంటామని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అరూరి రమేశ్ , పెద్ది సుదర్శన్రెడ్డి, సుంకె రవిశంకర్, జోగినపల్లి శ్రీనివాసరావు, బేడ బుడగ జంగాల జేఏసీ చైర్మన్ టీ జగదీశ్వర్, వైస్ చైర్మన్ చింతల యాదగిరి, నాయకులు చింతల దశరథ, విభూది నర్సింహులు, తిరుపాటి రామదాసు, పర్వత మధు, గోపాల్, భిక్షపతి, ఎస్సీ కార్పొరేషన్ వరంగల్ ఈడీ సురేశ్ తదితరులు పాల్గొన్నారు.