మహబూబాబాద్: రోడ్డు ప్రమాదం నలుగురిని బలితీసుకుంది. దర్గాకు వెళ్లివస్తున్న నలుగురు ఇల్లు చేరకుండానే అనంతలోకాలకు వెళ్లిపోయారు. టేకులపల్లికి చెందిన ఐదుగురు వ్యక్తులు అన్నా షరీఫ్ దర్గాకు వెళ్లి ఇళ్లకు తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. కేసముద్రం చేరగానే వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.
ప్రమాదం సమయంలో కారులో మొత్తం ఏడుగురు వ్యక్తులు ఉన్నారు. ఐదుగురు టేకులపల్లి వాసులు దర్గా దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా.. మహబూబాబాద్కు చెందిన ఇద్దరు మార్గమధ్యలో లిఫ్ట్ అడిగి కారెక్కారు. ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలవగా.. మిగతా ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. మృతుల్లో లిఫ్ట్ అడిగి ఎక్కిన లలిత, సురేష్తోపాటు టేకులపల్లికి చెందిన బద్రు నాయక్, అచ్చాలి ఉన్నారు.