సూర్యాపేట : సూర్యాపేట(Suryapet) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు(Car accident) ఢీ కొట్టడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన చివ్వెంల మండలం గుంజలూరు(Gunjaluru) వద్ద జాతీయ రహదారి 65 పై గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..విజయ వాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు గుంజలూరు వద్ద ప్రమాదానికి గురైంది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను సూర్యాపేట జనరల్ దవాఖానకు తరలించారు. కాగా, రోడ్డుపై ప్రమాదం చోటు చేసుకోవడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. రెండు కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ ఎసఐ విష్ణు ట్రాఫిక్ను క్లియర్ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.