ములుగు : కేరళ రాష్ట్రానికి చెందిన ఓ ప్రయివేటు బస్సు యాత్రికులతో భద్రాచలంలోని పర్ణశాల నుంచి తిరిగి బయల్దేరింది. ములుగు జిల్లా నూగూరు మండలం ఎదిరి గ్రామం వద్దకు రాగానే ఆ బస్సు డ్రైవర్ గుండెపోటుకు గురయ్యాడు. దీంతో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, బస్సులోని యాత్రికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది యాత్రికులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. యాత్రికులంతా ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన వారని తెలుస్తోంది.