మహబూబాబాద్ : జిల్లాలోని కురవి మండలం అయ్యగారిపల్లి ప్రధాన రహదారిపై ఓ ఇంట్లోకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. మహబూబాబాద్ బస్టాండ్ నుంచి మరిపెడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు అయ్యగారి పల్లి వద్ద అదుపు తప్పింది. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి పక్కన ఉన్న లాయర్ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఆ ఇంటికి కాంపౌండ్ వాల్ ఉండడంతో పెను ప్రమాదం తప్పింది.
కాంపౌండ్ వాల్ లేకుంటే ఇంట్లోకి తీసుకెళ్తే ప్రాణ నష్టం జరిగి ఉండేదని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు డ్రైవర్, కండక్టర్ తో పాటు మరో 10 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది.
ఇవి కూడా చదవండి..
ఏరువాకను ప్రారభించిన మంత్రి పువ్వాడ
కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహిళలు ఆర్థిక సాధికారత సాధించాలి
పాలమూరును సస్యశ్యామలం చేయడమే నా లక్ష్యం : మంత్రి శ్రీనివాస్ గౌడ్