కామారెడ్డి : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వృద్ధ దంపతులను దుండగులు దారుణంగా హతమర్చారు. వివరాల్లోకి వెళ్తే..బీర్కూరు మండలం రైతునగర్ గ్రామంలో వృద్ధ దంపతుల జంట హత్యలు కలకలం రేపాయి. నారాయణ (70) అయన భార్య సుశీల (65)ను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. గత పదేళ్ల క్రితం బతుకుదెరువు కోసం రైతు నగర్ వచ్చిన వీరు.. కిరాణా షాపు నడుపుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. త్వరలోనే నిందుతులను పట్టుకుంటామని బాన్సువాడ రూరల్ సీఐ మురళి తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.