నిజామాబాద్ : నగరానికి చెందిన 45వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ ఆకుల హేమలత శ్రీనివాస్ టీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ బిగాల సమక్షంలో పార్టీలో చేరిన ఆమెకు టీఆర్ఎస్ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీలకు చెందిన నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మల్లేష్యాదవ్, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.