మంచిర్యాల : సరదాగా సాగాల్సిన పతంగుల పండుగ ప్రాణాలను బలి తీసుకుంటున్నది. చైనా మాంజాను వినియోగించొద్దని ఎంత చెప్పినా జనాలు మాత్రం వినిపించుకోవట్లేదు. ప్రాణాలను తీసే చైనా మాంజానే నిర్లక్ష్యంగా ఉపయోగించి.. పలువురి మరణాలకు కారణమవుతున్నారు. మంచిర్యాల జిల్లాలో చైనా మాంజా.. ఓ ద్విచక్ర వాహనదారుడి గొంతుకు తగలడంతో తీవ్ర రక్తస్రావమై చనిపోయాడు.
ఇద్దరు దంపతులు బైక్పై వెళ్తుండగా.. చైనా మాంజా భర్త గొంతుకు తగిలింది. బైక్ వేగంగా వెళ్తుండటంతో.. ఆ మాంజా గొంతును కోసేసింది. దీంతో అతనికి తీవ్ర రక్తస్రావమైంది. అక్కడికక్కడే భర్త ప్రాణాలు కోల్పోవడంతో భార్య శోకసంద్రంలో మునిగిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.