గీసుగొండ, జూలై 30: గుండెపోటుతో 28 ఎండ్ల యువకుడు మృతిచెందాడు. గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ ధర్మారం గ్రామానికి చెందిన రాజబోయిన ప్రవీణ్ (28) గత ఏడాది డిగ్రీ పూర్తి చేసి వరంగల్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు.
ఆదివారం సెలవు కావటంతో ఇంటి వద్ద ఉన్నాడు. ఛాతిలో నొప్పిగా ఉన్నదని కుటుంబ సభ్యులకు చెప్పగా వారు వెంటనే దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు.