హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నది. రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో ఇప్పటివరకు 3, 19,96,177 మందికి (94.58 శాతం) ఎన్యుమరేషన్ ఫారాల (ఈఎఫ్ల) పంపిణీ పూర్తయింది. జిల్లాలవారీగా పరిశీలిస్తే.. నిర్మల్, జోగుళాంబ గద్వాల జిల్లాలు వందశాతం పంపిణీతో అగ్రస్థానంలో నిలిచాయి. నాగర్కర్నూల్ (99.98%), వనపర్తి (99.95%), జనగామ (99.94%) జిల్లాలు సైతం పంపిణీలో అత్యుత్తమ పనితీరును కనబరిచాయి. అత్యల్పంగా హైదరాబాద్ జిల్లాలో 81.51 శాతం, మేడ్చల్ మలాజిగిరి జిల్లాలో 88.42 శాతం మేర ఈఎఫ్ల పంపిణీ జరిగింది.
డిజిటలైజేషన్లో యాదాద్రి ముందంజ.. మేడ్చల్ లాస్ట్
పంపిణీ చేసిన పత్రాల డిజిటలైజేషన్ ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా సగటున 10.46 శాతానికి (35,39,214 పత్రాలు) చేరింది. డిజిటలైజేషన్ ప్రక్రియలో యాదాద్రి భువనగిరి జిల్లా 41.27 శాతంతో మొదటి స్థానంలో నిలవగా, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా 33.31 శాతంతో రెండోస్థానంలో నిలిచింది. అత్యధిక ఓటర్లు ఉన్న మేడ్చల్ మలాజిగిరి జిల్లా కేవలం 1.29 శాతం, హైదరాబాద్ జిల్లా 3.43 శాతం, రంగారెడ్డి జిల్లా 3.34 శాతంతో డిజిటలైజేషన్ ప్రక్రియలో చాలా వెనుకబడి ఉన్నాయి. హైదరాబాద్ జిల్లాలో మొత్తం ఓటర్లు 47,39,135 కాగా.. 81.51 శాతం ఈఎఫ్ల పంపిణీ, 3.43 శాతం డిజిటలైజేషన్ పూర్తయింది. రంగారెడ్డిలో ఓటర్లు 36,99,743 కాగా.. 93.07% పంపిణీ, 3.44% డిజిటలైజేషన్ పూర్తయింది. మేడ్చల్ మలాజిగిరిలో మొత్తం ఓటర్లు 29,79,130 కాగా.. 88.42% పంపిణీ, 1.29% డిజిటలైజేషన్ పూర్తయింది. నల్లగొండలోమొత్తం ఓటర్లు 15,16,2 53 కాగా.. 99.47% పంపిణీ, 29. 43% డిజిటలైజేషన్ పూర్తయింది.