30 రోజులపాటు దరఖాస్తుల స్వీకరణ
కసరత్తు ముమ్మరం చేసిన టీఎస్పీఎస్సీ
హైదరాబాద్, మార్చి 9 : ఉద్యోగాల భర్తీ నేపథ్యంలో అభ్యర్థులు సన్నద్ధమయ్యేందుకు తగిన సమయం ఇవ్వాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. ఇందుకు 30 నుంచి 90 రోజుల గడు వు ఇస్తామని కమిషన్ వర్గాలు పేర్కొంటున్నాయి. సీఎం కేసీఆర్ నుంచి పోస్టుల భర్తీ ప్రకటన వచ్చిన నేపథ్యంలో టీఎస్పీఎస్సీ అధికారులు కసరత్తు ముమ్మ రం చేశారు. ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వచ్చిన వెంటనే నోటిఫికేషన్ను జారీచేస్తామని అధికారులు చెప్తున్నారు. నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి దరఖాస్తుల స్వీకరణకు 30 రోజుల గడువు ఇస్తామని పేర్కొంటున్నారు. ప్రభుత్వం నుంచి ఇండెంట్ అందగానే ఆయాశాఖ అధికారులతో, టీఎస్పీఎస్సీ అధికారులు సంయుక్త సమవేశాన్ని నిర్వహించి, పలు అంశాలపై కూ లంకశంగా చర్చించి అంతా సవ్యంగా ఉందో లేదో పరిశీలిస్తారు.
పరిశీలించే అంశాలివే..