హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. కరీంనగర్ (గ్రాడ్యుయేట్, టీచర్), నల్లగొండ టీచర్ నియోజకవర్గాల నుంచి మొత్తం 90 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్టు సీఈవో తెలంగాణ సుదర్శన్రెడ్డి గురువారం ప్రకటించారు. కరీంనగర్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో 68 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా, 12 మంది వెనక్కి తీసుకోగా, 56 మంది బరిలో నిలిచారు. కరీంనగర్ టీచర్ నియోజకవర్గం నుంచి 16 మంది అభ్యర్థులు అర్హత సాధించగా, ఒకరు తమ నామినేషన్ వెనక్కి తీసుకోగా, 15 మం ది బరిలో ఉన్నారు. నల్లగొండ టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి 21 మంది అభ్యర్థులకు అర్హులుగా పరిగణించగా, నామినేషన్ల ఉపసంహరణతో 19 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్టు సీఈవో తెలంగాణ పేర్కొన్నారు.