నిజామాబాద్: జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద పోటెత్తుతున్నది. ఎగువన జోరుగా వర్షాలు కురుస్తుండటంతో వరద ప్రవాహం కొనసాగుతున్నది. దీంతో ప్రస్తుతం జలాశయంలోకి 80,544 క్యూసెక్కుల నీరు వస్తున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు. భారీగా వరద వస్తుండటంతో ప్రస్తుతం ప్రాజెక్టులో 1079.40 అడుగుల నీటిమట్టం ఉన్నది. జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 50.779 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. ప్రాజెక్టు కాలువలకు నీటిని విడుదల కొనసాగుతున్నది.