సిద్దిపేట/యాదాద్రి, జనవరి 20: యాదాద్రి ప్రధాన ఆలయ విమాన గోపురం స్వర్ణతాపడానికి భక్తుల నుంచి విరాళాలు వెల్లువలా వస్తున్నాయి. బుధవారం రాత్రి సిద్దిపేట నీలకంఠ సమాజం అధ్యక్ష, కార్యదర్శులు లోక లక్ష్మీరాజం, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్తోపాటు సమాజం సభ్యులు 5 తులాల బంగారాన్ని ఆర్థిక శాఖ మంత్రి టీ హరీశ్రావుకు అందజేశారు. నారాయణరావుపేట మండలం మల్యాల గ్రామం తరఫున స్థానిక ప్రజాప్రతినిధులు 2 తులాల బంగారం, సిద్దిపేట పట్టణంలోని 2వ వార్డు నర్సపురం నుంచి తులం బంగారాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు మంత్రి హరీశ్రావుకు అందజేశారు. కాగా హైదరాబాద్కు చెందిన రామానంద నాద గురువారం యాదాద్రి ఈవో కార్యాలయంలో ఏఈవో గట్టు శ్రవణ్కుమార్కు రూ.51,116 నగదును విరాళంగా అందజేశారు.