హైదరాబాద్ : రాష్ట్రంలో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈపీటీఆర్ఐ డైరెక్టర్ జనరల్గా వాణి ప్రసాద్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ విభాగం కార్యదర్శిగా నిర్మల, విపత్తు నిర్వహణ కార్యదర్శిగా మాణిక్కరాజ్, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్లుగా పౌసుమి బసు, శ్రుతి ఓజాను బదిలీ చేసింది. అలాగే విద్యాశాఖ ఉపకార్యదర్శిగా హరిత, ఎంసీఆర్హెచ్ఆర్డీ డైరెక్టర్ జనరల్గా అనితా రాజేంద్ర, పశు సంవర్ధకశాఖ ప్రత్యేక కార్యదర్శిగా అధర్ సిన్హాను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.