హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వద్ద 8 కీలక బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఈ బిల్లులు గత ఏడాది సెప్టెంబర్లో అసెంబ్లీ, మండలిలో ఆమోదం పొందగా, వాటిని ప్రభుత్వం గవర్నర్ ఆమోదం కోసం పంపింది. 4 నెలలు గడిచినా గవర్నర్ ఆమోదం తెలుపలేదు. ఇందులో ఉద్యోగాల నియమకాలకు సంబంధించిన బిల్లులు సైతం ఉన్నాయి.
గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్న బిల్లులు
1) తెలంగాణ విశ్వవిద్యాలయాలకు ఉమ్మడి రిక్రూట్మెంట్ బోర్డు బిల్లు
2) ములుగులోని అటవీ కళాశాల, పరిశోధనా సంస్థను అటవీ వర్సిటీగా అప్గ్రేడ్ చేసే బిల్లు
3) జీఎస్టీ చట్ట సవరణ
4) ఆజమాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా చట్ట సవరణ
5) మున్సిపల్ చట్ట సవరణ
6) పబ్లిక్ ఎంప్లాయిమెంట్ చట్ట సవరణ
7) ప్రైవేటు యూనివర్సిటీ సవరణ బిల్లు
8) మోటర్ వెహికిల్ టాక్సేషన్ సవరణ బిల్లు