హైదరాబాద్: ఉమ్మడి ఐదు జిల్లాల్లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు (MLC Elections) ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఆదిలాబాద్లో అత్యధికంగా పోలింగ్ నమోదవగా, కరీంనగర్లో తక్కువ శాతం ఓట్లు పోలయ్యాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు ఆదిలాబాద్లో 77.05 శాతం, నల్లగొండలో 42.8 శాతం, కరీంనగర్లో 17.82 శాతం, ఉమ్మడి మెదక్ జిల్లాలో 42.1 శాతం, ఖమ్మం జిల్లాలో 21.22 శాతం పోలింగ్ నమోదయింది.
ఉమ్మడి ఐదు జిల్లాల్లో 6 స్థానాకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగుస్తుంది. ఈ నెల 14న ఓట్లు లెక్కించనున్నారు.