హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): జైళ్లలో సుదీర్ఘకాలంగా శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో సత్ప్రవర్తన కలిగినవారిలో కొందరిని విడుదల చేయనున్నట్టు శనివారం సీఎం కేసీఆర్ ప్రకటించారు. 75 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 75 మంది ఖైదీలకు విము క్తి కలిగించనున్నట్టు తెలిపారు. వజ్రోత్సవాల సందర్భంగా ప్రభుత్వ పాలసీగా నిర్ణయం తీసుకొన్నామన్నారు.
వజ్రోత్సవాల నిర్వహణ కమిటీ చైర్మన్ కే కేశవరావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సుధీర్ఘంగా చర్చించామన్నారు. జైళ్లు, పోలీసుశాఖ అధికారులతో మా ట్లాడి సత్ప్రవర్తనతో విడుదల కావాల్సి న ఖైదీలు ఎవరైనా ఉంటే 75 మందిని రిలీజ్ చేయాలని కోరామని చెప్పారు.