హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలో నూతనంగా ఏర్పాటవుతున్న తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ పేరుపై రాజకీయంగా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పేరును సదరు కొత్త పార్టీకి కేటాయించవద్దని కోరుతూ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)తోపాటు ఇతరులు కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీఐ) ఫిర్యాదులు చేశారు. కవిత నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీ పేరు రిజిస్ట్రేషన్పై ఈసీకి ఇప్పటివరకు దాదాపు 700కుపైగా అభ్యంతరాలు అందాయి.
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అనే పేరుతో త మ పార్టీ దశాబ్దాలపాటు తెలంగాణ సెంటిమెంట్తో ముడిపడి ఉన్నదని, ప్రజల్లో ఆ పేరుకు గుర్తింపు ఉన్నదనే అంశాన్ని బీఆర్ఎస్ నేతలు గుర్తుచేశారు. కాబట్టి టీఆర్ఎస్ పేరును మరో పార్టీకి కేటాయించవద్దని కోరారు. కవిత పార్టీ పేరుపై అభ్యంతరాలు తెలియజేయడానికి ఈసీ విధించిన గడువు ఈనెల 1తో ముగిసింది.