సూర్యాపేట, మార్చి 30 : సూర్యాపేట జిల్లాలోని 475 గ్రామపంచాయతీల్లో ఏర్పాటు చేసిన నర్సరీల్లో నిబంధనలకు అనుగుణంగానే అన్నిరకాల మొక్కలు పెంచుతున్నట్లు కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ జిల్లాల కలెక్టర్లతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పల్లె ప్రగతి, హరితహారం, ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు, రైతు కల్లాలు, పల్లె ప్రకృతి వనాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, కొవిడ్ పరీక్షలపై వీడియో కాన్ఫరెన్స్లో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున మొక్కల సంరక్షణకు ఇప్పటికే అన్ని జాగ్రతలు తీసుకున్నట్లు తెలిపారు. ఇంటికి ఆరు మొక్కల పంపిణీతోపాటు ప్రభుత్వ స్థలాల్లో మొక్కలు పెద్ద ఎత్తున నాటేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ మోహన్రావు, డీఆర్డీఏ పీడీ సుందరి కిరణ్కుమార్, డీపీఓ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
హాలియా నుంచి నల్లగొండ కలెక్టర్
హాలియా తాసీల్దార్ కార్యాలయంలో నుంచి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ.. యాసంగికి సంబంధించిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అదనపు కలెక్టర్లు రాహుల్శర్మ, చంద్రశేఖర్, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, డీఎస్ఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ఎన్నికల ఏర్పాట్లు ప్రారంభం
జిల్లాలోని ఖాళీస్థానాల కోసం త్వరలో జరిగే ఎన్నికలకు ఏర్పాట్లు ప్రారంభించినట్లు కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో చనిపోయిన, రాజీనామా చేసిన సర్పంచ్ స్థానాలు 3, 140 వార్డుల్లో ఎన్నికల ఖర్చు వివరాలు చూపకపోవడంతో రద్దు చేసిన 100వార్డులు, రాజీనామా చేసిన, చనిపోయిన వార్డు సభ్యుల స్థానాలు 40 ఉన్నట్లు వివరించారు. ఆయా ఎన్నికల కోసం ఇప్పటికే ఏర్పాటు ప్రారంభించామని, ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని వీడియో కాన్ఫరెన్స్లో తెలిపారు. కార్యక్రమంలో డీపీఓ యాదయ్య, డీఆర్డీఏ పీడీ కిరణ్కుమార్, ఎంపీఓలు పాల్గొన్నారు.