Firoza Khan | ఖైరతాబాద్, ఫిబ్రవరి 28: హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని యాకుత్పురాలోని ఒకే ఇంటిలో 662 మంది ఓటర్లు ఉన్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మహ్మద్ ఫిరోజ్ఖాన్ ఆరోపించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. దీనికి సంబంధించిన అన్ని సాక్ష్యాలూ తన వద్ద ఉన్నాయని చెప్పారు.
హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ప్రధానంగా మలక్పేట, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చంద్రాయన్గుట్ట, యాకుత్పురా, బహదూర్పురాలో అత్యధికంగా బోగస్, డూప్లికేట్ ఓటర్లు ఉన్నారని ఆరోపించారు. ఈ బోగస్, డూప్లికేట్ ఓటర్లే ఎంఐఎం పార్టీకి బలమని ఆరోపించారు. ఎన్నికల కమిషనర్లు సకాలంలో బోగస్ ఓట్లును తొలగిస్తే లోక్సభ ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయని తెలిపారు.