హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : ప్రజాభవన్లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం 611 దరఖాస్తులు అందాయి. ఎస్సీ వెల్ఫేర్ 149, బీసీ వెల్ఫేర్ 123, మైనారిటీ వెల్ఫేర్ 94, విద్యుత్తుశాఖ 57, రెవెన్యూ 54, ఇతర శాఖలకు సంబంధించి 134 దరఖాస్తులు అందినట్టు అధికారులు తెలిపారు.
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ప్రజాపాలన ప్రత్యేక అధికారి దివ్య దరఖాస్తులు స్వీకరించారు.