హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశి త బొగ్గు ఉత్పత్తి సాధించాలంటే రోజుకు 14.4 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీని తొలగిం చాలని, ఇందుకు ప్రతిరోజూ 600 టన్నుల పేలుడు పదార్థాలను సరఫరా చేయాలని ఎక్స్ప్లోజివ్స్ తయారీదారులు, సరఫరాదా రులను సింగరేణి డైరెక్టర్లు చంద్రశేఖర్, బల రాం ఆదేశించారు. ఇండెంట్లో ప్రస్తుతం 80 శాతం మాత్రమే పేలుడు పదార్థాల సరఫరా చేస్తున్నారని, దీనిని 100 శాతానికి పెంచాలని సూచించారు. కొన్ని గనుల్లో బా ్లస్టింగ్ విఫలమైందని, నాణ్యమైన పేలుడు ప దార్థాలు సరఫరా చేయాలని కోరారు. బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనలో మెకనైజ్డ్ భూగర్భ గనులు ముఖ్యపాత్ర పోషించాలని సింగరే ణి డైరెక్టర్లు చంద్రశేఖర్, సత్యనారాయణ భూగర్భ గనులపై నిర్వహించిన సమీక్షలో పేర్కొన్నారు. అడ్రియాల గని నుంచి రోజుకు 6 వేల టన్నులకు తక్కువ కాకుండా బొగ్గు ఉత్పత్తి చేయాలని సూచించారు.
త్వరలో రామగుండం-3 నుంచి సోలార్ విద్యుత్తు
రామగుండం -3 ఏరియాలో మిగిలిన 10 మెగావాట్ల సోలార్ ప్లాంట్ నిర్మాణాన్ని ఈ నెల 10వ తేదీలోగా పూర్తిచేసి, గ్రిడ్తో అనుసంధానం చేయాలని సింగరేణి డైరెక్టర్ సత్యనారాయణరావు అధికారులను ఆదేశి ంచారు. ఇప్పటివరకు నిర్మించిన 209 మె గావాట్ల సోలార్ ప్లాంట్ల ద్వారా 166 మిలి యన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసి నట్టు తెలిపారు. దీనివల్ల కంపెనీకి రూ.85 కోట్ల వరకు ఆదా అయినట్టు వెల్లడించారు.