ముంబై: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, మంత్రి అయిన ఆదిత్య ఠాక్రేకు కరోనా సోకింది. తేలికపాటి కరోనా లక్షణాలు కనిపించగా పరీక్ష చేయించుకున్నానని, శనివారం పాజిటివ్గా రిపోర్టు వచ్చిందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్ష చేయించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమన్నది గుర్తించాలని కోరారు. కరోనా నిబంధనలు పాటించి సురక్షితంగా ఉండాలని పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ట్వీట్ చేశారు.